ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్కు షాక్...బెన్స్టోక్స్ సెంచరీతో రాజస్థాన్ విజయం
By: chandrasekar Mon, 26 Oct 2020 10:05 AM
ముంబై ఇండియన్స్ను
మట్టికరిపించిన రాజస్థాన్ రాయల్స్ 8
వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో బెన్స్టోక్స్(107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత సెంచరీ చేసాడు. సంజూ శాంసన్(54
నాటౌట్: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 196 పరుగుల లక్ష్యాన్ని18.2 ఓవర్లలోనే 2
వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని
ఛేదించింది. స్టోక్స్, శాంసన్
జోడీ ఎలాంటి ఒత్తిడి లేకుండా 150కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అంతకుముందు ఆల్రౌండర్
హార్దిక్ పాండ్య(60 నాటౌట్ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(37), సూర్యకుమార్
యాదవ్(40), సౌరభ్
తివారీ(34) తమదైన
శైలిలో రెచ్చిపోవడంతో ముంబై అనూహ్య స్కోరు చేసింది