ఎంపీ రఘురామకు షాక్… వైసీపీ శ్రేణుల సంతోషం…
By: chandrasekar Mon, 19 Oct 2020 11:45 AM
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం
ఎంపీగా ఎన్నికై ఆ పార్టీకే కొరకరాని కొయ్యగా తయారైన రఘురామ కృష్ణరాజుకు ఎట్టకేలకు
ఆ పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ
స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామ కృష్ణరాజును తప్పిస్తూ లోక్సభ
స్పీకర్ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొంత కాలంగా తన పదవికి ఎలాంటి
ఢోకా లేదని చెబుతూ వస్తున్న రఘురామకు షాక్ తగిలింది. అలాగే సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన
చైర్మన్గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు.
అక్టోబర్ 9వ తేదీ
నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం వెల్లడించింది. ఈ
మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నూతన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీని
నియమించారు. ఇందులో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరి కమిటీ చైర్మన్గా
వ్యవహరించనుండగా, తెలంగాణకు చెందిన నామా నాగేశ్వరరావు సభ్యుడిగా
కొనసాగనున్నారు.