బ్యాంక్ కస్టమర్లందరికీ షాక్
By: chandrasekar Thu, 01 Oct 2020 12:16 PM
ఆర్బీఐ కొత్త రూల్స్
అమలులోకి వచ్చాయి. దీంతో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉపయోగించే వారు కొన్ని విషయాలు
కచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు నుంచి కొన్ని సర్వీసులు బంద్ కానున్నాయి.
దేశీ అతిపెద్ద బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఎస్బీఐ
సెప్టెంబర్ 30 నుంచి కొన్ని రకాల సర్వీసులను నిలిపివేసింది.
ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఈ విషయాన్ని తన డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు తెలియజేసింది.
ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడే వారు వారి కార్డులపై అంతర్జాతీయ
లావాదేవీలను నిర్వహించాలని భావిస్తే.. ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. బ్యాంక్
ఈ సర్వీసులు పొందాలని భావించే వారికి ఒక నెంబర్కు ఇచ్చింది. దీనికి మెసేజ్ పంపి ఈ
అంతర్జాతీయ సర్వీసులను యాక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది.
లేదంటే మీ కార్డులపై ఈ
సర్వీసులు అందుబాటులో ఉండవు. స్టేట్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలకు అనువుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ
ఇటీవల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు కొత్త రూల్స్ తీసుకువచ్చిన విషయం
తెలిసిందే. ఇవి జనవరిలోనే అమలులోకి వచ్చాయి. అయితే కోవిడ్ 19 కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా
అమలులోకి వచ్చాయి.సెప్టెంబర్ 30 నుంచే ఆర్బీఐ కొత్త డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్ అమలులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఎస్బీఐ కూడా
తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. బ్యాంక్ కస్టమర్లు ఈ సర్వీసులు పొందాలని
భావిస్తే...INTL అని టైప్ చేసి 5676791 నెంబర్కు మెసేజ్
పంపాలి. బ్యాంక్ అకౌంట్తో అనుసంధానమైన నెంబర్ నుంచే ఈ ఎస్ఎంఎస్ పంపాల్సి
ఉంటుంది.మీరు వద్దనుకుంటే ఎలాంటి మెసేజ్ పంపించాల్సిన అవసరం లేదు.
మీ కార్డుపై అంతర్జాతీయ
ట్రాన్సాక్షన్లు నిలిచిపోతాయి. కాగా ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం. క్రెడిట్
కార్డు, డెబిట్ కార్డు వినియోగదారులు వారి కార్డుపై
ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, కార్డ్ నాట్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్లు, కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్లకు సర్వీసులను సెపరేట్గా
యాక్టివేట్ చేసుకోవాలి.