ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ అడిషనల్ డీజీ వెంకటేశ్వర రావుకు మరోసారి షాక్
By: chandrasekar Sat, 19 Dec 2020 11:27 AM
గత టీడీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వర రావు కీలక బాధ్యతలను
నిర్వర్తించారు. అప్పుడు ఇంటెలిజెన్స్
చీఫ్గా పని చేస్తున్న ఆయన్ను ఎన్నికల సంఘం ఆదేశించడంతో బదిలీ చేశారు. ఆ తరువాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో
చాలా కాలం పాటు ఏ పోస్టింగ్ అతనికి
ఇవ్వలేదు.
ఆ తరువాత కొంత కాలం
క్రితం వెంకటేశ్వర రావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మరో మారు వెంకటేశ్వర రావు
పై క్రమశిక్షణ చర్యలు జగన్ ప్రభుత్వం
పూనుకుంది. గతంలో జగన్ ప్రభుత్వం వెంకటేశ్వర రావు ను సస్పెండ్ చేయడంతో అయన క్యాట్
ను అప్పుడు ఆశ్రయించి సస్పెండ్ పై సవాలు చేశారు.
ఇందుకుగాను తనను సస్పెండ్
చేయడంపై రాజకీయ కారణాలు ఉన్నట్లు అయన ఆరోపించారు. అందువల్ల మరో మారు వెంకటేశ్వర
రావుకు నోటీసులిచ్చి పదిహేను రోజులలోగా రిటన్ స్టేట్ మెంట్ అందించాలని సీఎస్
నోటీసులు అందించారు. అయన అంతలోగా రిటన్ స్టేట్ మెంట్ ఇవ్వకపోతే చర్య తీసుకోనున్నట్లు
తెలిపారు.