Advertisement

  • ఏడు నెలల తర్వాత కలిసిన షోయబ్ మాలిక్‌, సానియా మీర్జా

ఏడు నెలల తర్వాత కలిసిన షోయబ్ మాలిక్‌, సానియా మీర్జా

By: chandrasekar Fri, 11 Sept 2020 12:12 PM

ఏడు నెలల తర్వాత కలిసిన షోయబ్ మాలిక్‌, సానియా మీర్జా


దాదాపు ఏడు నెలల తర్వాత ఇంగ్లాండ్ టూర్‌ని ముగించుకుని ఇటీవల దుబాయ్‌కి షోయబ్ మాలిక్‌రాగా తాజాగా హైదరాబాద్ నుంచి తన కొడుకు ఇజాన్‌తో కలిసి అక్కడికి వెళ్లిన సానియా మీర్జా అతడ్ని కలిసింది. ఇజాన్‌తో దుబాయ్‌లో తాను ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో మాలిక్ షేర్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి‌లో అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించగా హైదరాబాద్‌లో సానియా మీర్జా, పాకిస్థాన్‌లో షోయబ్ మాలిక్ ఉండిపోయారు.

జులైలో సానియా మీర్జాని కలిసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కూడా షోయబ్ మాలిక్ అనుమతి తెచ్చుకున్నాడు. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి పర్మీషన్ లభించకపోవడంతో పాక్ నుంచి నేరుగా ఇంగ్లాండ్‌కి మాలిక్‌కి వెళ్లిపోయాడు. దుబాయ్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత పాకిస్థాక్‌కి మాలిక్, సానియా మీర్జా వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టూర్‌లో ఆశించిన మేర రాణించలేకపోయిన షోయబ్ మాలిక్ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :
|
|

Advertisement