Advertisement

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఫై శివసేన సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఫై శివసేన సంచలన వ్యాఖ్యలు

By: chandrasekar Fri, 28 Aug 2020 2:02 PM

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఫై శివసేన సంచలన వ్యాఖ్యలు


ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకుంటారని భావించినా.. అటువంటిది జరగలేదు. మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అధ్యక్ష బాధ్యతలను యువ నాయకత్వం స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం స్వరం పెంచింది. తాజాగా, రాహుల్ మద్దతుదారుల్లో శివసేన చేరింది. దేశానికి బలమైన ప్రతిపక్ష పార్టీ అవసరం కాబట్టి కాంగ్రెస్ తనను తాను పునరుద్ధరించుకోవాలని, రాహుల్ గాంధీ ఆమోదయోగ్యమైన ఏకైక నాయకుడని అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ గురువారం పేర్కొన్నారు.

దీర్ఘకాల రాజకీయ విరోధిగా ఉన్న శివసేన.. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా మారిన విషయం విదితమే. దేశానికి బలమైన ప్రతిపక్షం ఆవసరం ఉంది. ఆ గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి ఉంది.. ప్రస్తుత గందరగోళం నుంచి కోలుకుని పని ప్రారంభించాలని సూచించారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ‘సోనియా గాంధీకి వయసు పైబడింది.. ప్రియాంక గాంధీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడంలేదు.. పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు, వీరి కారణంగా రాహుల్ గాంధీ పని చేయలేకపోతున్నారు. కాంగ్రెస్‌లో గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నేను చూడలేదు’ అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలోని 23 సీనియర్ల సోనియా గాంధీకి రాసిన లేఖపై ఇటీవల శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసిన సంజయ్ రౌత్.. రాహుల్ గాంధీ‌ని అధ్యక్షుడి కాకుండా అడ్డుకుని, ఆయన నాయకత్వాన్ని ముగించే కుట్ర అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని, కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తరువాత పార్టీ పునరుద్దరణను వారు ఎందుకు సవాల్‌గా తీసుకోలేదని సామ్నా నిలదీసింది. ‘రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ముగించే జాతీయ కుట్రలో సీనియర్ నేతలు భాగస్వామిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓటమి ఖాయం ... ఈ పాత కాపలాదారులు రాహుల్ గాంధీని అంతర్గతంగా విధ్వంసం చేశారు. ఇది బీజేపీని ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది అని వ్యాఖ్యానించింది.

Tags :

Advertisement