Advertisement

  • ఐపీల్ లో కొత్త రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్

ఐపీల్ లో కొత్త రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్

By: chandrasekar Wed, 21 Oct 2020 10:13 AM

ఐపీల్ లో కొత్త రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్


ఐపీల్ 2020 లో శిఖర్ ధావన్ వరుసగా రెండు సెంచరీ లు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దుబాయిలో ఐపీల్ 2020 జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ లో శిఖర్ ధావన్ పరుగుల వేటలో చరిత్ర సష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న గబ్బర్ వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు చేసి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ రెండు మ్యాచుల్లో ధావన్ నాటౌట్ గా నిలవడం మరో విశేషం.

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 101 పరుగులు చేసిన గబ్బర్, పంజాబ్ తో జరిగిన మ్యాచులో 106 రన్స్ చేశాడు. ఐపీఎల్ లీగ్ లో వరుసగా రెండు మ్యాచుల్లో రెండు శతకాలు కొట్టిన తొలి వీరుడుగా గబ్బర్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా వరుస మ్యాచుల్లో సెంచరీలు చేసిన తొలి ఐపిఎల్ క్రీడాకారుడిగా తన పేరు నమోదు చేసుకున్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్ ధావన్ 57 బంతుల్లో100 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి. ఇంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచు జరగగా 58 బంతుల్లో 101 పరుగులు ధావన్ చేశాడు. ఎటువంటి తడబాటు లేకుండా విరోచితమైన ఆటను ప్రదర్శించాడు.

Tags :
|
|
|

Advertisement