వృధాగా మారిన శిఖర్ ధావన్ సెంచరీ... సునాయాసంగా గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్
By: chandrasekar Wed, 21 Oct 2020 10:11 AM
ఢిల్లీ డేర్ డెవిల్స్
మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో శిఖర్ ధావన్ సెంచరీ వృధాగా
మారింది. ఐపీఎల్ 2020 సీజన్లో బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకున్న
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ
క్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 165
పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలిన ఉండగానే పంజాబ్ టీమ్ 167/5తో
ఛేదించేసింది. శిఖర్ ధావన్ సెంచరీ చేసిన టీం పెద్ద స్కోరును అందుకోలేక పోయింది.
మొదట బాటింగ్ చేసిన
ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12x4,
3x6) సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 5
వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా ఛేదనలో నికోలస్ పూరన్ (53: 28 బంతుల్లో 6x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్కి క్రిస్గేల్ (29: 13 బంతుల్లో 3x4, 2x6), గ్లెన్ మాక్స్వెల్ (32: 24 బంతుల్లో 3x4) హిట్టింగ్
తోడవడంతో పంజాబ్ టీమ్ 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా
సీజన్లో పదో మ్యాచ్ ఆడిన పంజాబ్కి ఇది నాలుగో విజయంకాగా ఢిల్లీకి ఇది మూడో
ఓటమిగా మిగిలింది.