టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న శిఖర్ ధావన్...ధోనీ ప్లేస్ లో..
By: chandrasekar Mon, 07 Dec 2020 12:05 PM
ఆస్ట్రేలియాతో సిడ్నీ
వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో విలువైన హాఫ్ సెంచరీ బాదిన శిఖర్ ధావన్ (52: 36 బంతుల్లో 4x4, 2x6).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లోకి
ఎగబాకాడు.
98 అంతర్జాతీయ టీ20లు ఆడిన ధోనీ 1,617 పరుగులతో ఇప్పటి వరకూ టాప్-3లో
ఉండగా శిఖర్ ధావన్ 1,641 పరుగులతో తాజాగా మూడో స్థానానికి చేరుకున్నాడు.
గబ్బర్ 63 మ్యాచ్ల్లోనే
ఈ మార్క్ని చేరుకోగా ధోనీ నాలుగో స్థానానికి పడిపోయాడు.
టాప్లో మాత్రం టీమిండియా
కెప్టెన్ విరాట్ కోహ్లీ 84 టీ20ల్లో 2,843 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో వైస్ కెప్టెన్
రోహిత్ శర్మ 108 మ్యాచ్ల్లో 2,773 పరుగులతో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం
సిడ్నీ వేదికగానే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
అంతర్జాతీయ క్రికెట్కి ఈ
ఏడాది ఆగస్టులో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. 2011లో టీ20ల్లోకి
ఎంట్రీ ఇచ్చిన శిఖర్ ధావన్కి మొదట్లో ఎక్కువగా అవకాశాలు లభించలేదు. కీలకమైన 2014, 2016 టీ20
ప్రపంచకప్లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయినప్పటికీ.. గబ్బర్ టీ20ల్లో
ప్రమాదకర ఓపెనర్గా ఆడుతున్నాడు.