ఐపీయల్ లో ఏ భారత ఆటగాడికి లేని రికార్డు సాధించిన ధావన్
By: Sankar Thu, 15 Oct 2020 1:48 PM
ఐపీఎల్ 2020 లో నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో అత్యధిక అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు .
నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 30 బంతిలో హాఫ్ సెంచరీ చేసిన ధావన్ కు ఇది ఐపీఎల్ లో 39 వ హాఫ్ సెంచరీ. దీనికంటే ముందు ధావన్ విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మలతో 38 అర్ధశతకాలు చేసిన భారత ఆటగాడిగా వారితో సమానంగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు మ్యాచ్ ముంబై ఇండియన్స్ పై 52 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసాడు ధావన్.
కానీ అందులో చాలా నెమ్మదిగా ఆడటంతో అతని పై విమర్శలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ లో ధావన్ కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులు చేసాడు. ఇక ధావన్ కు ఐపీఎల్ టోర్నీలో ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
Tags :
hits |