సుశాంత్ కేసులో స్టేట్ మెంట్ ఇచ్చిన శేఖర్ కపూర్
By: chandrasekar Fri, 10 July 2020 11:54 AM
బాంద్రా పోలీసులు సుశాంత్
సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసు దర్యాప్తులో
భాగంగా పోలీసులు దర్శకుడు శేఖర్ కపూర్ స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. ముంబైలోని
స్థానిక మీడియా కథనం ప్రకారం శేఖర్ కపూర్ ప్రస్తుతం ముంబైలో లేకపోవడంతో పోలీసులకు
ఈమెయిల్ ద్వారా తన స్టేట్ మెంట్ ను పంపించినట్టు తెలుస్తోంది. అయితే శేఖర్ కపూర్
ముంబైకి తిరిగొచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వాంగ్మూలాన్ని తీసుకోవాలని
భావిస్తున్నట్టు సమాచారం.
సుశాంత్ మరణం తర్వాత మేం
శేఖర్ కపూర్ కు నోటీసులు పంపాం. ఆయన మెయిల్ ద్వారా కొంత సమాచారం మాకు అందించారు.
కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తి వివరాల కోసం ముంబైకి
తిరిగొచ్చిన శేఖర్ కపూర్ ను వివరణాత్మక స్టేట్ మెంట్ ఇవ్వాల్సిందిగా సూచించామని
సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా 27
మందిని పోలీసులు విచారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రముఖ దర్శక నిర్మాత
సంజయ్ లీలా బన్సాలీని కూడా ప్రశ్నించారు.