Advertisement

కరోనా పేషెంట్ మీద లైంగికదాడి

By: chandrasekar Fri, 24 July 2020 08:55 AM

కరోనా పేషెంట్ మీద లైంగికదాడి


ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో ఉన్న సర్దార్ పటేల్ కరోనా చికిత్స కేంద్రంలో చికిత్స పొందుతున్న 14 సంవత్సరాల బాలిక మరో కరోనా పేషెంట్ మీద బాత్రూమ్‌లో లైంగికదాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు.

జూలై 15వ తేదీ రాత్రి బాలిక బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగినట్టు పోలీసులు చెప్పారు. 19 సంవత్సరాల వయసున్న ఆ యువకుడు, తన స్నేహితుడితో కలసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితులు ఇద్దరినీ పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఢిల్లీలోని ఛత్తార్‌పూర్‌లో 10,000 బెడ్స్‌తో కరోనా కేర్ సెంటర్ ఏర్పాటైంది. కొన్ని రోజుల క్రితం ఈ చికిత్స కేంద్రాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రారంభించారు. కరోనా లక్షణాలు తక్కువ స్థాయిలో ఉన్నవారు, అసలు కరోనా లక్షణాలు లేకపోయినా వైరస్ సోకిన వారికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు చూస్తున్నారు.

ఘటన జరిగిన రోజు బాధితురాలు ఐటీబీపీ అధికారికి సమాచారం ఇచ్చింది. దీంతో వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలిని అక్కడి నుంచి మరో చికిత్స కేంద్రానికి తరలించారు. నిందితులను కూడా మరో కరోనా చికిత్స కేంద్రంలో చేర్చారు.

Tags :
|

Advertisement