Advertisement

  • 16 ఏండ్ల బాలికతో పాటు మరో ఆరుగురు మహిళలపై లైంగికదాడి

16 ఏండ్ల బాలికతో పాటు మరో ఆరుగురు మహిళలపై లైంగికదాడి

By: chandrasekar Wed, 16 Sept 2020 5:14 PM

16 ఏండ్ల బాలికతో పాటు మరో ఆరుగురు మహిళలపై లైంగికదాడి


ఓ వ్యాపారవేత్త 16 ఏండ్ల బాలికను బెదిరింపులకు గురిచేస్తూ రెండేండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సత్నా జిల్లాలో జరిగింది. బాలికతో పాటు మరో ఆరుగురు మహిళలపై కూడా ఆ వ్యాపారి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగికదాడికి పాల్పడగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు సత్నా జిల్లాకు చెందిన సమీర్‌ అలియాస్‌ అతిక్‌ అనే వ్యాపారవేత్తకు ఇంతకుముందు ఓ మహిళతో వివాహం అయ్యింది. వ్యక్తిగత కారణాల వల్ల భార్యకు 2017లో విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత అతడు మహిళలతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేయడమే కాకుండా పలుమార్లు లైంగికదాడికి పాల్పడేవాడు.

వారిలో 16 ఏండ్ల బాలిక కూడా ఉంది. మొదట బాలికను పరిచయం చేసుకున్న వ్యక్తి లైంగికదాడికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ రెండేండ్లుగా అత్యాచారానికి గురిచేస్తున్నాడు.

ధైర్యం చేసుకొని బాలిక సెప్టెంబర్‌ 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే నిందితుడికి రెండు పేర్ల మీద పాస్‌పోర్టులున్నాయని, అతడి ఇంట్లో సత్నా, రేవా ఎమ్మెల్యేల పేరిట నకిలీ లెటర్ హెడ్లను కనుగొన్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి చేసిన నేరాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రియాజ్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement