Advertisement

  • రాజస్థాన్ విషాదం ... రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

రాజస్థాన్ విషాదం ... రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

By: Sankar Sun, 13 Dec 2020 09:43 AM

రాజస్థాన్ విషాదం ... రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, పలువురికి గాయాలు


రాజస్థాన్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చిత్తోరగఢ్ జిల్లా సదుల్‌ఖెరా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఉదయ్‌పూర్-నింబాహెరా జాతీయ రహదారిపై జీప్‌ను ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో జీపులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంతో మరో 9 మంది గాయపడినట్టు చిత్తోర్‌గఢ్ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు.

ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని.. నికుంభా వద్ద జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా వాహనాల అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement