యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఏడుగురు మృతి , 25 మందికి తీవ్ర గాయాలు
By: Sankar Wed, 16 Dec 2020 2:25 PM
పొగమంచు కారణముగా ఉత్తరప్రదేశ్లోని సాంభాల్ జిల్లాలో ఆగ్రా - మోర్దాబాద్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యూపీకి చెందిన ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును అలీఘర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.