ఆక్స్ఫర్డ్ వాక్సిన్ రెండవ , మూడవ దశ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చిన డీసీజీఏ
By: Sankar Mon, 03 Aug 2020 8:58 PM
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రా జెనికా కోవిడ్ వ్యాక్సిన్ 2వ, 3వ దశ ట్రయల్స్ ను నిర్వహించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కోవిషీల్డ్ పేరుతో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకా పరీక్షిస్తున్నది.
కోవిడ్19 నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే మూడవ దశ ట్రయల్స్ నిర్వహణకు ముందు.. డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నాలుగు వారాల వ్యవధిలో రెండు డోస్లు ఇవ్వనున్నారు.
మొదటి రోజు తొలి డోస్.. ఆ తర్వాత 29వ రోజున రెండవ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం సుమారు 1600 మందిపై ఇండియాలో సీరమ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. 17 నగరాల్లో ఈ పరీక్షలు చేపట్టనున్నారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 2,3వ ట్రయల్స్ బ్రిటన్లో కొనసాగుతున్నాయి. బ్రెజిల్లో ఫేజ్ త్రీ, దక్షిణాఫ్రికాలో మొదటి, రెండవ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి.