Advertisement

  • ఆర్బీఐ చెప్పిన ఆ ఒక్క మాటతో భారీగా జోరు అందుకున్న సెన్సెక్స్

ఆర్బీఐ చెప్పిన ఆ ఒక్క మాటతో భారీగా జోరు అందుకున్న సెన్సెక్స్

By: Sankar Fri, 04 Dec 2020 12:03 PM

ఆర్బీఐ చెప్పిన ఆ ఒక్క మాటతో భారీగా జోరు అందుకున్న సెన్సెక్స్


దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్‌బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు జంప్‌చేసింది.

వెరసి మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్లను అధిగమించింది. 45,023కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా ఎగసింది. 13,248ను దాటింది. తద్వారా ఇంట్రాడేలో సరికొత్త గరిష్టానికి చేరుకుంది.

ఈ ఏడాది క్యూ3లో జీడీపీ 5.6 శాతం క్షీణతను చవిచూడనుందన్న అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్‌బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు

Tags :
|
|

Advertisement