Advertisement

  • మాఫియా డాన్ నయీంకేసులో మరొకసారి వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు...

మాఫియా డాన్ నయీంకేసులో మరొకసారి వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు...

By: chandrasekar Mon, 14 Dec 2020 10:50 PM

మాఫియా డాన్ నయీంకేసులో మరొకసారి వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు...


నయీమ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తర్వాత కూడా అతని దగ్గర ఎన్ని ఆయుధాలను, డబ్బును స్వాధీనపర్చుకున్నారనే విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంది. పోలీసులు ఈ కేసులో పూర్తిగా ఎంక్వయిరీ చేయాలంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అధికారులు ఈ కేసును పట్టించుకోకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. బయట పెట్టిన విషయాలు దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చిందాని పోలీసులు తెలుపలేదని అ౦ది.

మొత్తం 24 సీజ్ చేసిన ఆయుధాలు నయీమ్ దగ్గరకి ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీస్ అధికారులు చెప్పలేకపోయారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. కేవలం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సరఫరా చేస్తుంటుంది. కానీ నయీం దగ్గర బుల్లెట్ జాకెట్ ఎక్కడిది. ఆరు వందలపైగా సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.

Tags :

Advertisement