ఉగ్రవాదుల రహస్య స్థావరాన్నిఛేదించి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
By: chandrasekar Sat, 31 Oct 2020 3:46 PM
భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా గంభీర్ మొఘ్లాన్ సమీప అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల
రహస్య స్థావరాన్ని ఛేదించాయి.
భారీగా ఆయుధాలను, మందు
గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
అటవీ ప్రాంతంలో ఉగ్ర స్థావరాలున్నాయన్న సమాచారం మేరకు జమ్ముకశ్మీర్
పోలీసులు, 38
రాష్ట్రీయ రైఫిళ్లు శుక్రవారం సంయుక్త తనిఖీ ఆపరేషన్ చేపట్టాయి.
భూమి కింద రాతి కట్టడంలో
దాచిన రెండు ఆటోమెటిక్ ఏకే-47 రైఫిళ్లు, రెండు ఏకే -47 మ్యాగజైన్లు,
270 బుల్లెట్లు, 2 చైనీస్ పిస్టళ్లు, రెండు పిస్టళ్ల
మ్యాగజైన్లు, 75 పీకా రౌండ్లు,
12 బ్లాంక్ రౌండ్లు, 10 డిటోనేటర్లు, 5 నుంచి
6 కిలోల
పేలుడు పదార్థాల సామగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు రాజౌరీ ఎస్ఎస్పీ
చందన్ కోహ్లి పేర్కొన్నారు.
మంజకోట్ పోలీసులు పలు
సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిసర
ప్రాంతాల్లోనూ తనిఖీ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.