ఉత్తర కశ్మీర్లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
By: chandrasekar Fri, 04 Sept 2020 10:00 PM
జమ్ముకశ్మీర్లో ఈరోజు ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా పాఠాన్లోని యెదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది.
ఈ మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తెల్లవారుజామున నాకాబందీ నిర్వహించాయని జమ్ముకశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరుపుతున్నాయని తెలిపారు.
ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించామన్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు ఇంకా తెలియ రాలేదు.
Tags :
security |
forces |
fire |