Advertisement

  • ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు

By: chandrasekar Sat, 17 Oct 2020 1:31 PM

ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు


శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరాన్ని గుర్తించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు అవంతిపొరా పోలీసులు గురువారం 55 రాష్ట్రీయ రైఫిల్స్, 185 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్‌తో కలిసి కవాని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య భూగర్భ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, 2091 రౌండ్ల ఎకె -47 మందుగుండు, ఒక పిస్టల్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవంతిపొరా పోలీసులు తెలిపారు. ఈ రహస్య భూగర్భ స్థావరానికి సంబంధించిన వీడియోను భద్రతా దళాలు రిలీజ్ చేశాయి.

Tags :

Advertisement