హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ ను హతమార్చిన భద్రతా బలగాలు
By: chandrasekar Mon, 02 Nov 2020 3:23 PM
శ్రీనగర్లో జరిగిన ఎన్
కౌంటర్లో హిజ్బుల్ చీఫ్ కమాండర్ సైఫుల్లాను భద్రతా బలగాలు హతమార్చాయి. రంగ్రేత్లోని పాత ఎయిర్ ఫీల్డ్
ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్
నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల మీద టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. బలగాలు
జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా చనిపోయాడు.
సైఫుల్లా కాశ్మీర్ వ్యాలీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. 2014లో
అతడు టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరాడు. భద్రతా బలగాల మీద టెర్రరిస్టులు జరిపిన
దాడుల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ రియాజ్
నైకూ ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత సైఫుల్లా ఆ ప్లేస్లోకి వచ్చాడు.
‘సైఫుల్లా 2014 నుంచి టెర్రరిస్టు గ్రూపులో యాక్టివ్గా ఉన్నాడు.
బుర్హాన్ వనీతో కలసి పనిచేశాడు. భద్రతా బలగాలు అతడి కదలికలపై రెండు రోజుల నుంచి
కన్నేశాయి.’ అని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ పేర్కొన్నారు. ఎన్ కౌంటర్
ప్రదేశంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నాయి. హిజ్బుల్
ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా హతం కావడం భద్రతా బలగాల ఘన విజయం అని పోలీసు
వర్గాలు చెబుతున్నాయి. ‘పోలీసులు, భద్రతా బలగాలకు ఇది ఘనవిజయం. ఇదేం చిన్న ఘనత కాదు.’
అని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఎన్ కౌంటర్ స్థలాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ కాశ్మీర్ నుంచి
సైఫుల్లా ఇక్కడకు వచ్చినట్టు తమకు సమాచారం వచ్చిందని, ఓ
ఇంట్లో దాక్కునట్టు తెలిసిందని చెప్పారు. ‘సైఫుల్లా ఇక్కడకు వచ్చినట్టు సమాచారం
అందింది. దీంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఎదురుకాల్పుల్లో
టెర్రరిస్టు చనిపోయాడు. అతడు సైఫుల్లా అని మేం 95 శాతం నమ్ముతున్నాం.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని వివరాలు తర్వాత తెలుస్తాయి.’ అని
కుమార్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసుల నెట్ వర్క్ చాలా బలంగా మారిందని, ఏ
ఉగ్రవాది అయినా నగరంలోకి ప్రవేశిస్తే ఖచ్చితమైన సమాచారం వస్తోందని పేర్కొన్నారు.