Advertisement

ఆగస్ట్‌ 3న ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ప్రారంభం

By: Sankar Wed, 20 May 2020 3:47 PM

ఆగస్ట్‌ 3న ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ప్రారంభం


ఆగస్ట్‌ 3న రాష్ట్రంలోని పాఠశాలన్నీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్తను అందించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఈ మేరకు నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధిపై సీఎం ఆరా తీశారు.

schools,august,reopen,jaganmohan,corona ,ఆగస్ట్‌ 3న, పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్, జగన్‌మోహన్‌రెడ్డి, కరోనా వైరస్‌


జులై నెలా ఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడ-–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామని ఆయన తెలిపారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి చేసే విధంగా ఆయా జాల్లా కలెక్టర్లు పనులపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి అని సూచించారు. మరోవైపు పాఠశాలల అభివృధి పనుల కోసం ఇసుక, సిమెంటు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :
|
|

Advertisement