Advertisement

  • అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు వైరల్...

అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు వైరల్...

By: chandrasekar Tue, 15 Dec 2020 4:13 PM

అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు వైరల్...


అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎంతో అనుభవం సంపాదించిన కొంతమంది క్రికెటర్స్ తమ కోపాన్ని కంట్రోల్‌లో చేయగలుగుతారు. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం తమ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయలేక తోటి ఆటగాళ్లపై దాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌కి చెందిన సీనియర్ క్రికెటర్ ముష్ ఫిఖర్ రహీం విషయంలో ఇదే జరిగింది. క్రికెట్ అనేది జెంటిల్‌మేన్స్ గేమ్ అని అంటుంటారు. ఈ గేమ్‌లోనూ అప్పుడప్పుడు ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడం మనకు తెలుసు.

బంగబంధు టీ20 కప్‌లో భాగంగా బెక్సింకో ఢాకా vs ఫార్చూన్ బరిషల్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన ముష్‌ఫిఖర్ రహీం జట్టు 149 పరుగులు చేసింది. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బరిషల్ జట్టు దాదాపు విజయానికి చేరువలో ఉందనగా తమ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆతిఫ్ హుస్సేన్ 17వ ఓవర్ చివరి బంతికి షాట్‌కి ప్రయత్నించబోగా అది గాల్లోకి లేచింది. జోష్ మీదున్న ఆతిఫ్‌ని ఔట్ చేసేందుకు ఇదే రైట్ టైమ్ అని భావించిన ముష్‌ఫిఖర్ రహీం ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు వెళ్లగా అదే క్యాచ్ కోసం నాసుం అహ్మెద్ కూడా పోటీపడ్డాడు. ఒకనొక దశలో ఒకరినొకరు ఢీకొనే పరిస్థితి నుంచి తప్పించుకుని క్యాచ్ పట్టుకున్న ముష్‌ఫిఖర్ రహీం అనంతరం తనకు పోటీకి వచ్చిన అహ్మెద్‌పై గుడ్లురిమి చూడటంతో పాటు ఒక్క పంచ్ ఇచ్చానంటే అన్నట్టు ఎక్స్ప్రెషన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అహ్మెద్‌పై రహీం ఆగ్రహం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అహ్మెద్‌ని సముదాయిస్తూ అతడి టీమ్‌మేట్స్ వారిని శాంతపరిచారు.

Tags :
|

Advertisement