- హోమ్›
- వార్తలు›
- పీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటే మెచూరిటీ సమయానికి రూ.40 లక్షలు నుండి 66 లక్షల వరకు పొందవచ్చు
పీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటే మెచూరిటీ సమయానికి రూ.40 లక్షలు నుండి 66 లక్షల వరకు పొందవచ్చు
By: chandrasekar Fri, 14 Aug 2020 6:53 PM
పీపీఎఫ్ ఖాతాని పోస్ట్
ఆఫీసులో లేదా SBI లో అకౌంట్ తెరిచి డబ్బులు దాచుకుంటే మెచూరిటీ సమయానికి రూ.40 లక్షలు నుండి 66 లక్షల
వరకు పొందవచ్చు. మీ పిల్లలపై రూ.లక్షలు కూడబెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే
మీ కోసం ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు.
పీపీఎఫ్ పథకం ద్వారా చాలా ప్రయోజనాలు పొందొచ్చు. మంచి రాబడి మరియు పన్ను ప్రయోజనాలు
వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.
ఫ్యూచర్ ప్లాన్ కోసం
పీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటే పూర్తి భరోసా లభిస్తుంది. మీ డబ్బుకు రిస్క్
ఉండదు. కచ్చితమైన రాబడి లభిస్తుంది.
పీపీఎఫ్ అకౌంట్ను భారతీయులు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్
బ్రాంచ్కు వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. తల్లిదండ్రులు పిల్లల పేరుపై కూడా ఈ
అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 15
ఏళ్లు. దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. మెచ్యూరిటీ సమయంలో మీరు
పొందే అమౌంట్పై ఎలాంటి ట్యాక్స్ పడవు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ
కింద ఈ బెనిఫిట్ పొందొచ్చు.
ఈ పీపీఎఫ్ అకౌంట్లో ఒక
ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.1.5 లక్షల
వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు పీపీఎఫ్ అకౌంట్లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే మీరు సంవత్సరంలో మీరు డిపాజిట్ చేసే మొత్తం రూ.1.5
లక్షలు అవుతుంది. పీపీఎఫ్ అకౌంట్పై ఇప్పుడు 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి సంవత్సరం వడ్డీ మొత్తం
పీపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. 15 ఏళ్ల తర్వాత మీరు డబ్బులు వెనక్కి తీసుకోవాలని
భావిస్తే రూ.40 లక్షలు వస్తాయి. మరో 5 ఏళ్లు ఆగితే అప్పుడు
మీకు రూ.66 లక్షలు
లభిస్తాయి. పిల్లలు ఎదిగిన సమయానికి అవసరాలకు తగ్గట్టు చేతికి డబ్బులు అందడంతో
ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.