Advertisement

  • కరోనా కారణంగా మూడు దేశాల విమాన ప్రయాణాలు నిలిపివేసిన సౌదీ

కరోనా కారణంగా మూడు దేశాల విమాన ప్రయాణాలు నిలిపివేసిన సౌదీ

By: chandrasekar Thu, 24 Sept 2020 6:21 PM

కరోనా  కారణంగా మూడు దేశాల  విమాన ప్రయాణాలు నిలిపివేసిన సౌదీ


సౌదీ అరేబియా... తాజాగా భారత్‌తోపాటు బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాలకు విమాన ప్రయాణాలను నిలిపివేసింది. ఈ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా సౌదీకి చెందిన జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (జీఏసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నది. సౌదీ నుంచి ఆ దేశాలకు, ఆ దేశాల నుంచి సౌదీకి విమాన రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మూడు దేశాల్లో గత 14 రోజులుగా ఉన్నవారిని కూడా తమ దేశంలోకి అనుమతించబోమని సౌదీ స్పష్టం చేసింది.

అయితే ప్రభుత్వ ఆహ్వానితులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌కు చెందిన ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానాల్లో ప్రయాణించిన వారికి కరోనా ఉండటంతో రెండు వారాల పాటు దుబాయ్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్త్నుట్లు ఇటీవల చెప్పింది. అయితే ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తర్వాత పేర్కొంది.

Tags :
|

Advertisement