సివిల్స్ ఫలితాల్లో 218 ర్యాంక్ సాధించిన తంగడపల్లి గ్రామ వాసి సత్య ప్రకాష్ గౌడ్
By: chandrasekar Wed, 05 Aug 2020 6:48 PM
సివిల్స్ ఫలితాల్లో
చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన బడేటి సత్య ప్రకాష్ గౌడ్ ఐఏఎస్ ఫలితాల్లో 218
ర్యాంక్ సాధించాడు. తంగడపల్లికి చెందిన బడేటి అశోక్, వసంత దంపతుల కుమారుడు
సత్య ప్రకాష్ గౌడ్. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు.
నల్గొండ జిల్లా
కేంద్రంలోని సెయింట్ ఆల్ఫెన్స్ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రైవేట్ పాఠశాలలో 8,9,10 తరగతులను హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్ స్కూల్ లో చదివాడు.
ఇంటర్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. తన బీ.టెక్ ను 2018 లో
ఐఐటీ పాట్నాలో పూర్తి చేశాడు.
అప్పటి నుంచి సివిల్
పరీక్షలకు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో సివిల్స్ రాసి మొదటి సారే 218 రాంక్
కైవసం చేసుకొని ఐపీఎస్ అధికారిగాగా ఎన్నిక కానున్నాడు. ఈ సందర్భంగా అతను
మాట్లాడుతూ ఐపీఎస్ సాధించి మహిళలు ,చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తానని
చెప్పాడు.