Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ పై విరుచుకుపడ్డ సంజు శాంసన్

చెన్నై సూపర్ కింగ్స్ పై విరుచుకుపడ్డ సంజు శాంసన్

By: chandrasekar Wed, 23 Sept 2020 10:41 AM

చెన్నై సూపర్ కింగ్స్ పై విరుచుకుపడ్డ సంజు శాంసన్


ఐపీల్ 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడ్డ రాజస్థాన్ రాయల్ మ్యాచ్లో సంజు శాంసన్ విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ అదరగొట్టాడు. స్టేడియంలో పరుగుల వాన కురిపించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ చెలరేగిపోయడు. వరుస సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్ బంతిని అన్ని వైపులా పరిగెతించాడు. ఆరో ఓవర్‌లో రెండు, మూడు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన శాంసన్ చావ్లా వేసిన ఏడో ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు ఉరకలెత్తుతోంది. బౌలర్లకు అతనిని కట్టడి చేయడం చాలా కష్టంగా మారింది.

అన్నివైపులా బంతులు పరుగులు తీసింది. తొలి మూడు మ్యాచుల్లో ప్రేక్షకులకు అంతగా లభించని మజాను శాంసన్ అందిస్తున్నాడు. శాంసన్ బాదుడుకు 9 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయిని చేరుకుంది. మరోవైపు, స్మిత్ కూడా జోరు పెంచాడు. వీరి బాదుడికి చెన్నై బౌలర్లు ప్రేక్షులుగా మారారు. స్టాండ్స్‌లోకి వెళ్తున్నబంతిని అందుకోవడానికే పరిమితమయ్యారు. పీయూష్ చావ్లా రెండు ఓవర్లలో ఏకంగా 47 పరుగులు ఇచ్చుకున్నాడంటే శాంసన్, స్మిత్ బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 32 బంతుల్లో74 పరుగులు సాధించాడు. ఇందులో 9 సిక్సులు ఒక ఫోర్ తో వీరబాదుడు బాదాడు. ప్రేక్షకులకు కనువిందు చేసాడు.

Tags :
|
|

Advertisement