Advertisement

  • కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సంజయ్ రౌత్

కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సంజయ్ రౌత్

By: chandrasekar Thu, 10 Dec 2020 9:42 PM

కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సంజయ్ రౌత్


మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రావ్‌సాహేబ్ దాన్వే రైతుల ఆందోళనల గురించి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయ౦ తెలిసిందే. ఎన్నార్సీ, సీఏఏ విషయంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయని కేంద్ర మంత్రి రైతులను కూడా అదే విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేమీ రైతుల ఉద్యమం కాదు. వీటి వెనుక పాక్, చైనాలున్నాయని ఆరోపించారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వారు రైతులు కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఎన్సార్సీ, సీఏఏపై అప్పట్లో ముస్లింలను ఆందోళనకు గురిచేసి, ఆరు నెలల్లోగా దేశం నుంచి తరిమేస్తారని భయభ్రాంతులకు గురిచేశారని, వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో రైతులను ఇప్పుడు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సరియైన జవాబు ఇచ్చారు. రైతుల ఉద్యమం వెనుక చైనా, పాకిస్థాన్‌లు ఉంటే వెంటనే వాటిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి చెప్పినట్టు రైతుల ఆందోళనల వెనుక పొరుగు దేశాల హస్తం ఉందనే సమాచారం ఉన్నట్టయితే, ఇది చాలా పెద్ధ విషయమని దీనిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, త్రివిధ దళాల అధిపతులు వెంటనే సమావేశమై చర్చించాలని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి దాన్వే వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి అరవింద్ సావంత్ కూడా ఖండించారు. మహారాష్ట్రలో అధికారం కోల్పోవడంతో బీజేపీ నేతలు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement