Advertisement

  • కీమో థెరపీ తీసుకొంటూనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంజయ్ దత్

కీమో థెరపీ తీసుకొంటూనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంజయ్ దత్

By: chandrasekar Thu, 10 Sept 2020 09:33 AM

కీమో థెరపీ తీసుకొంటూనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంజయ్ దత్


లంగ్‌ క్యాన్సర్ తో బాధ పడుతుతున్న సంజయ్ దత్ తన సినిమాలను పూర్తి చేయడానికి షూటింగ్లలో పాల్గొంటున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కేన్సర్ ఉందని ఈ మధ్యే తేలింది. ఆయనకు లంగ్‌ క్యాన్సర్‌ చాలా అడ్వాన్సడ్ స్టేజీలో ఉందని కూడా వైద్యులు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతానికి బాగానే ఉన్నా కూడా ఎప్పటికైనా అది ప్రమాదమే అని డాక్టర్స్ తెలిపారు. దాంతో ఆయన అమెరికా వెళ్లి చికిత్స కూడా తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అయితే దానికంటే ముందు ఈయన పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉండిపోయాయి. ఈయన ప్రస్తుతం చాలా సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు.

ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వడంతో వాటిని పూర్తి చెయ్యడానికి సిద్దమయ్యాడు. దాదాపు 500 కోట్లకు పైగానే బిజినెస్ ఈయనపై ఇండస్ట్రీలో రన్ అవుతుంది. ఆ సినిమాలన్నీ అలాగే వదిలేసి వెళ్లిపోవడం భావ్యం కాదని భావించిన సంజయ్ దత్ ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో బిజీ అయిపోయాడు. కేన్సర్ ఒంట్లో ఉన్నా కూడా ఆయన షూటింగ్‌కు వస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోనే సంజయ్ దత్ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి సెషన్‌ కీమో థెరఫీ చికిత్సలో పాల్గొంటున్నాడు. అలాగే షూటింగ్స్ కూడా చేస్తున్నాడు.

గత రెండు మూడు రోజులుగా ఈయన షంషేర్ షూట్‌లో పాల్గొంటున్నాడు. ఓ వైపు కేన్సర్ ఉండగానే ఇలా షూటింగ్ చేస్తుండటం అభిమానులను కలవరపెడుతున్నది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సంజయ్ దత్ షూటింగ్‌కు వస్తున్నాడు. అయినా కూడా ఇలాంటి సమయంలో సంజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా మందిని టెన్షన్ పెడుతున్నాయి. త్వరలోనే ఈయన కెజిఎఫ్ 2లో కూడా నటించబోతున్నాడు. ఇందులో అధీర పాత్రలో నటిస్తున్నాడు సంజూ బాబా. సంజయ్ అనారోగ్యంపై అతని అభిమానులు చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. త్వరగానే అతను కోలుకుని మామూలు స్థితికి రావాలని వేడుకుంటున్నారు.

Tags :

Advertisement