ఎంటీవీ వెబ్ సిరీస్తో సానియా మీర్జా
By: chandrasekar Mon, 16 Nov 2020 8:52 PM
ఎంటీవీ వెబ్ సిరీస్తో
సానియా మీర్జా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు
ఇపుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్దమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్
వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించనుంది. 5 ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్
సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. భారత్లో ట్యుబర్య్కులోసిస్
పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది.
దేశంలో టీబీ నిరంతరం
పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం
చూపించే అవకాశముంటుందని సానియామీర్జా అభిప్రాయపడ్డారు. ఎంటీవీ సమర్పిస్తున్న
ఈ షోతో చేపట్టే సమిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల మార్పు తీసుకునేందుకు దోహదపడుతుందని
సానియామీర్జా ఆకాంక్షించింది. ఇది ఎంతగానో అవేర్ నెస్ ను కలిగిస్తుంది.