హైదరాబాద్ పార్కులో ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న గంధం చెట్లు మాయ౦...
By: chandrasekar Wed, 11 Nov 2020 9:33 PM
హైదరాబాద్ నగరంలోని
ఇందిరా పార్క్లో గంధపు చెట్లు దొంగతనానికి గురి కావడం కలకలం రేపుతోంది. పార్కులో ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న గంధం
చెట్లు మాయమయ్యాయి. మొత్తం 13 గంధపు చెట్లు నరికి వేసి ఉన్నట్టుగా పోలీసులు
తేల్చారు.
ఈ సంఘటన ఆదివారం
జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి గాంధీనగర్ పోలీసులకు ఇందిరా
పార్క్ మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని
విచారణ చేస్తున్నారు.
అయితే ఆదివారం
తెల్లవారుజామున గంధం చెట్లను నరికి వేసి వాటిని తరలించినట్లు అధికారులు మరుసటి
రోజు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యంగా దీని వెనకాల
గతంలో పనిచేసిన సిబ్బంది ఉండి ఉండొచ్చని లేకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది
హస్తం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 53 గంధం
చెట్లు మాయమయ్యాయి.