ధోని న్యూ గడ్డం స్టైల్ పై కామెంట్స్ చేసిన ధోని భార్య సాక్షి
By: Sankar Sun, 20 Sept 2020 4:39 PM
ఇండియాలో మళ్ళీ క్రికెట్ ప్రభంజనం మొదలు అయింది..కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలకు పైగా క్రికెట్ కు దూరంగా ఉన్న ఆటగాళ్లు నిన్న యూఏఈ లో మొదలయిన ఐపీయల్ తో బరిలోకి దిగారు..తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి..అయితే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు చెన్నై కెప్టెన్ ధోని మీదనే ఉన్నాయ్..దాదాపు 437 రోజుల తర్వాత ధోని మైదానంలోకి దిగడంతోఅభిమానులు అందరు ధోని చూడటం కోసం టివి లకు అతుక్కుపోయారు..
అయితే ఈ మ్యాచ్ లో ధోని తన గడ్డం స్టయిల్ను కాస్త మార్చుకొని, గతం కంటే భిన్నంగా ఫిట్గా కనిపించాడు. ఆయన ఫిట్నెస్, హెయిర్ స్టైల్ సరికొత్తగా కనిపించాయి. అయితే.. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచిన తర్వాత ధోని భార్య సాక్షిసింగ్.. ధోని చేతిలో మైక్ ఉన్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ పోస్ట్లో 'ఎంత అందంగా ఉన్నాడో' అంటూ రాసుకొచ్చింది..
సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తరువాత.. లాక్డౌన్లో క్రికెట్కు దూరంగా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారంటూ ధోనిని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అడిగాడు. సమాధానంగా లాక్డౌన్లో స్వేచ్చగా, ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడిపినట్లు చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నందుకు మిగతా టీమ్ సభ్యులను కూడా అభినందించారు.