‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో సాయికుమార్
By: chandrasekar Tue, 28 July 2020 1:25 PM
రాజ్యసభ సభ్యుడు
జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమాజం పట్ల ప్రేమ ఉన్న
ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. జులై 27న టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ తన పుట్టినరోజు
సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో
భాగం పంచుకున్నారు. ఎంపీ సంతోష్ ఆశయం తనలో స్ఫూర్తిని నింపిందని సాయికుమార్ అన్నారు.
మొక్కలు నాటిన తరువాత
సాయికుమార్ మాట్లాడుతూ.. “అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీంı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న
యాతీıı ఒక
రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మర్రి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, ఐదు
మామిడి చెట్లు, పది పూల చెట్లు నాటినవాడు నరకానికి వెళ్లడు అంటుంది
‘శ్రీ వరహా పురాణం’.
మూడు మొక్కలు నాటి నీకే
కాదు మరో ముగ్గురికి ప్రాణవాయువును ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది ‘గ్రీన్ ఇండియా
ఛాలెంజ్’. అందుకే ప్రతీ ఒక్కరు పాపపుణ్యాలకు అతీతంగా సమాజహితం కోసం మొక్కలు
నాటాలి. జనం బాగుకోరే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకువెళ్లాలి’’ అని
అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్ తనయుడు, హీరో ఆది, కూతురు-అల్లుడు డాక్టర్ జ్యోతిర్మయి-కృష్ణ ఫాల్గున
దంపతులు, సాయికుమార్
సతీమణి సురేఖ, కోడలు అరుణ, మనవరాలు అయాన అందరూ కలిసి మొక్కలు నాటారు.