సమాజంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలపై తీవ్రంగా స్పందించిన సాయిపల్లవి
By: chandrasekar Thu, 09 July 2020 3:26 PM
కొన్ని రోజులుగా సమాజంలో
చోటు చేసుకొంటున్న అమానవీయ సంఘటనలపై సినీ నటి సాయిపల్లవి తీవ్రంగా స్పందించారు.
‘మానవజాతి మీద రోజురోజుకూ నమ్మకం క్షీణించిపోతున్నది. బలహీనుల్ని బలవంతులు
బాధపెడుతున్నారు, పైశాచికానందం కోసం పిల్లల ఉసురుతీస్తున్నారు. ఒకవైపు
కరోనాతో ప్రపంచమంతా యుద్ధం చేస్తుంటే, మరోవైపు మనలో మనం కొట్లాడుకొంటున్నాం.
ఏ సమస్య అయినా సోషల్
మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడే ఎంతోకొంత న్యాయం జరుగుతుంది. కానీ ఎన్నో నేరాలు
బయటికి రావడం లేదు. వాటి పరిస్థితి ఏమిటి?’ అని వ్యవస్థను నిలదీస్తున్నారు సాయిపల్లవి.
తమిళనాడులో తండ్రీకొడుకుల విషయంలో పోలీసుల దారుణ ప్రవర్తన, పసికందులపై
లైంగికదాడులు ఆమెను కదిలించాయి, కన్నీళ్లు పెట్టించాయి.
Tags :
was very |