Advertisement

  • ఏడేళ్ల చిన్నారిపై పైశాచికంగా లైంగిక దాడి ఫై ఆక్రోషం వెల్లగక్కిన సాయి పల్లవి

ఏడేళ్ల చిన్నారిపై పైశాచికంగా లైంగిక దాడి ఫై ఆక్రోషం వెల్లగక్కిన సాయి పల్లవి

By: chandrasekar Sat, 04 July 2020 3:55 PM

ఏడేళ్ల చిన్నారిపై పైశాచికంగా లైంగిక దాడి ఫై ఆక్రోషం వెల్లగక్కిన సాయి పల్లవి


అసలు మనం మనుషులమేనా మనకు మానవత్వం ఉందా అంటూ సాయి పల్లవి తన ఆక్రోషం వెల్లగక్కింది. తాజాగా తమిళనాడులో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై కొంత మంది పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికీ గురైంది. ఆ తర్వాత బాలికను ఎంతో క్రూరంగా చంపారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సాయి పల్లవి కూడా స్పందించింది. అంతేకాదు భావోద్వేగానికీ గురైంది. అంతేకాదు ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వాళ్లను ఉరి తీసిన తక్కువే అంటూ ఒకింత ఎమోషనల్ అయింది.

అంతేకాదు రోజు రోజుకీ మనం మనుషులమన్న సంగతే మర్చిపోతున్నట్టు ఉంది. మన సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు అంటూ భావోద్వేగానికి గురైంది. రాక్షసానందం పొందడం కోసం చిన్నారులను బలి తీసుకోవడం అమానుషమన్నారు.

మానవ జాతిని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ప్రకృతి అపుడపుడు మనల్ని గుర్తు చేస్తోంది. ఇలాంటి ఘోరాలు చూడడానికేనా మనం బతికి ఉన్నది. ఇలాంటి రాక్షస లోకంలో మరో బిడ్డను తీసుకొచ్చే అర్హత కోల్పోయామంటూ తన ఆవేదన వెల్లగక్కింది. మొత్తంగా ఇలాంటి ఘోర కృత్యాలకు పాల్పడిన వాళ్లకు ఎంత శిక్ష వేసిన తక్కువ అంటూ సోషల్ మీడియా వేదికగా అందరు గళమెత్తుతున్నారు.

Tags :
|

Advertisement