అంపైర్స్ కాల్ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాస్టర్ సచిన్ టెండూల్కర్
By: Sankar Mon, 28 Dec 2020 2:06 PM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రివ్యూ కోరిన ఎక్కువసార్లు అంపైర్ కాల్స్ అని వచ్చాయి ..దీనితో డిఆర్ఎస్ సిస్టం మీద మరొకసారి చర్చ మొదలయింది...తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంపైర్ డెసిషన్ రీవ్యూ సిస్టమ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇందులోని అంపైర్స్ కాల్ను అతను ప్రశ్నించాడు.
అసలు ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తితోనే ప్లేయర్స్ డీఆర్ఎస్ కోరతారని, అలాంటప్పుడు ఈ అంపైర్స్ కాల్ ఏంటి అని సచిన్ ట్వీట్ చేశాడు. ఈ డీఆర్ఎస్ను ఐసీసీ క్షుణ్నంగా పరిశీలించాలి. ముఖ్యంగా అంపైర్స్ కాల్ను అని మాస్టర్ ట్వీట్ చేశాడు. ఈ అంపైర్స్ కాల్ నిబంధన కారణంగానే రెండో టెస్ట్లో టీమిండియా రెండు వికెట్లను తీయలేకపోయింది.
బంతి వికెట్లను తగులుతున్నట్లు బాల్ ట్రాకింగ్లో తేలినా.. అంపైర్స్ కాల్ అని రావడంతో వాటిని నాటౌట్గానే ప్రకటించారు. అంపైర్స్ కాల్ నిబంధనల ప్రకారం.. 50-50 చాన్స్ ఉన్నపుడు లేదా బంతి నేరుగా వికెట్లను తగలకుండా కేవలం అలా అంచులను తాకుతూ వెళ్తుందని తేలినప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే నిలుస్తుంది.