Advertisement

సీఎం అశోక్ గెహ్లాట్ తో సచిన్ పైలట్ భేటీ

By: chandrasekar Fri, 14 Aug 2020 11:34 AM

సీఎం అశోక్ గెహ్లాట్ తో  సచిన్ పైలట్ భేటీ


రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఎట్టకేలకు మళ్ళీ ఒకటైయ్యారు. గురువారం అశోక్ గెహ్లాట్ నివాసానికి వెళ్లి సచిన్ ఆయనను కలిశారు. గెహ్లాట్ కూడా సచిన్ పైలట్‌ను సాదరంగా ఆహ్వానించారు. రాజస్థాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం జరుగనున్నది.

ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం సాయంత్రం తన నివాసంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు నెల రోజులకుపైగా పార్టీకి దూరంగా ఉన్న సచిన్ పైలట్ ఇటీవల రాహుల్, ప్రియాంక గాంధీలతో భేటీతో మెత్తబడ్డారు.

ఆయన చెప్పుకున్న సమస్యలపై ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న సచిన్ పైలట్ బుధవారం రాజస్థాన్‌కు తిరిగి వచ్చారు.

సీఎల్పీ భేటీ నేపథ్యంలో గురువారం సీఎం గెహ్లాట్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. దీనికి ముందు సచిన్ పైలట్ విధేయులైన ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ తీసివేసింది.

Tags :
|
|
|
|

Advertisement