సచిన్ ఫోన్ చేసి ఐపీయల్ ఆడాలి అంటే ఎవరో మిమిక్రీ చేస్తున్నారు అనుకున్న ...ల్యూక్ రైట్
By: Sankar Thu, 28 May 2020 11:36 AM
ఐపీయల్ లో ఆడాలని ఎందరో యువ ఆటగాళ్లు కలలు కంటుంటారు ..ఎందరో యువ ఆటగాళ్లు ఐపీయల్ రాణించి జాతీయ జట్లలో స్థానం సంపాదించారు ..ఇంత ఘనత ఉన్న ఐపీయల్ లో ఆడాలని స్వయంగా క్రికెట్ దేవుడు సచిన్ ఫోన్ చేస్తే , కాదనే ఆటగాళ్లు ఎవరైనా ఉంటారా ..కానీ అలాంటి అవకాశం వచ్చినప్పటికి దానిని మిస్ చేసుకున్న ఆటగాడు ల్యూక్ రైట్ ..2008 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని తనకు సచిన్ ఫోన్ చేశారని.. కానీ అప్పుడు అతను అది నిజం అనుకోలేదని అతను తెలిపాడు.
అయితే అప్పటి ఇంగ్ల్డండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ తన కెరీర్ ఆరంభంలో తనకు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చుంటే.. తన ప్రతిభ మరింత మెరుగుపడేదని అతను పేర్కొన్నాడు. ‘‘ఇంగ్లండ్కి ఆడకముందు నేను ఫ్రాంచైజీల తరఫున ఆడి ఉంటే.. నాకు ఎంతో లాభం చేకూరేది. అందుకే ఆరంభంలో నేను ఐపీఎల్ని మిస్ అయ్యాను. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ నాకు ఫోన్ చేసి మొదటి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాలని కోరారు. కానీ నేను అది జోక్ అనుకున్నాను. ఎవరో పోకిరి కుర్రాళ్లు మిమిక్రి చేస్తున్నారని భావించాను’’ అని రైట్ పేర్కొన్నాడు.