Advertisement

బస్సు సర్వీసులు నిలిపివేసిన ఏ పి ఎస్ ఆర్టీసీ

By: Dimple Tue, 14 July 2020 4:33 PM

బస్సు సర్వీసులు నిలిపివేసిన ఏ పి ఎస్ ఆర్టీసీ


ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు ఆగిపోయాయి. కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఈడీ తెలిపారు.


బెంగళూరుతో పాటూ కర్ణాటక నుంచి బస్సుల్లో రావాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఏపీ-కర్ణాటక మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి 23 వరకు బస్సు సర్వీసులు ఆగిపోయాయి. కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కర్ణాటకలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఈడీ తెలిపారు. టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేయనున్నారు.


ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారికి మాత్రమే రోడ్లపైకి అనుమతి ఇస్తారు. ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రకటించింది.. అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది.

Tags :
|
|

Advertisement