గురువారం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు
By: chandrasekar Thu, 21 May 2020 2:16 PM
లాక్ డౌన్ నుంచి కేంద్రం
కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు ఆంధ్ర ప్రదేశ్
ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు.
గుంటూరులో గురువారం నుంచి 99
ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు రెడీ అయ్యారు. గుంటూరు నుంచి విజయవాడ, నరసరావుపేట, మాచర్ల,మంగళగిరి, తెనాలి, ఒంగోలు, రేపల్లె, చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను
నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
టిక్కెట్ విక్రయాలు ఆన్ లైన్
లో వీలు కాని పక్షంలో ఆయా బస్ స్టాండ్ల
లోనే ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లను ఇస్తామని అధికారులు పేర్కొన్నారు. ఒక చోట
నుంచి మరొచోటకు నాన్ స్టాప్ సర్వీస్ లను మాత్రమే సిద్ధం చేశారు. మధ్యలో ఎక్కడా
బస్సులు ఆపటం, ప్రయాణీకులను ఎక్కించు కోవటం, దింపటం వంటివి ఉండవని ఆర్టీసీ అధికారులు స్పష్టం
చేశారు.