Advertisement

  • పొల్లాలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ..తృటిలో తప్పిన పెను ప్రమాదం..

పొల్లాలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ..తృటిలో తప్పిన పెను ప్రమాదం..

By: Sankar Sun, 01 Nov 2020 2:28 PM

పొల్లాలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ..తృటిలో తప్పిన పెను ప్రమాదం..


వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.ఆర్టీసీ బస్సు పొలంలోకి దూసుకుపోవడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

అయితే..డ్రైవర్‌ చాకచక్యంతో పెద్ద ప్రమాదమేమి జరగలేదు. వివరాల్లోకి వెళితే...తాండూరు నుండి జీవన్గి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బషీరాబాద్ మండలం గంగ్వార్ వద్ద ముందు భాగం కమాన్ కట్టలు విరిగడంతో.. రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది బస్సు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కండక్టర్ సహా ముగ్గురికి గాయాలు, లక్ష్మమ్మ అనే మహిళ కాలు విరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయల పాలైన మహిళలను చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఇదే బస్సు బషీరాబాద్ మండలం గోటికేకుర్దు వద్ద రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురి కావడం విశేషం.

Tags :
|

Advertisement