కానుకల ద్వారా టీటీడీకి రూ.33లక్షల ఆదాయం
By: chandrasekar Fri, 24 July 2020 09:24 AM
కరోనా భయంతో శ్రీవారి
ఆలయానికి రావడానికి భక్తులు జంకుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.
ప్రతీ రోజు 13వేల
మంది భక్తులు దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా బుధవారం 5,360 మంది
భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శంచుకున్నారు.
ఆలయానికి భక్తులు
సమర్పించిన కానుకల ద్వారా రూ.33లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
2225 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. చిత్తూరు
జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో సర్వదర్శనం టిక్కెట్లను మూడురోజుల
క్రితం రద్దు చేశారు.
ఆన్లైన్లో టికెట్లు
పొందిన వారికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
Tags :
income |
to ttd |