Advertisement

  • రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు గత ఏడాదిగా బిల్లులు కట్టటం లేదు...!

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు గత ఏడాదిగా బిల్లులు కట్టటం లేదు...!

By: Anji Tue, 15 Dec 2020 1:42 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, నేతలు గత ఏడాదిగా బిల్లులు కట్టటం లేదు...!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే సహా పలువురు మంత్రుల అధికారిక భవనాల్ని డీఫాల్టర్ (పన్ను ఎగవేత)​ జాబితాలో చేర్చింది ముంబయి పురపాలక సంఘం.

ఠాక్రేతో పాటు పలువురు మంత్రుల భవనాల నీటి పన్నులు సుమారు రూ.24.56 లక్షలు చెల్లించాల్సి ఉన్నందును ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

షకీల్​ అహ్మద్​ అనే ఆర్టీఐ కార్యకర్త వివరాలు కోరగా.. ప్రభుత్వ భవానాల నీటి బిల్లుల అంశం బయటపడింది.

రాష్ట్ర మంత్రులు, నేతలు గత ఏడాదిగా బిల్లులు కట్టటం లేదని, దాంతో ఆయా భవనాలను డీఫాల్టర్​ జాబితాలో చేర్చినట్లు చెప్పారు షకీల్​.

నీటి పన్నును మంత్రులు తమ జేబు నుంచి కట్టాల్సిన అవసరం లేనప్పటికీ.. ఏడాదికిపైగా పెండింగ్​లో ఉండటం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​ బిల్లులను చెల్లించకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి.

Tags :

Advertisement