విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు: పవన్ కళ్యాణ్
By: chandrasekar Wed, 02 Sept 2020 6:28 PM
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ అభిమానులు 25
అడుగుల ఎత్తున బ్యానర్ కట్టే ప్రయత్నం చేశారు. అయితే బ్యానర్ కట్టే క్రమంలో విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి.
మొత్తం 10
మంది విద్యుదాఘాతానికి గురి కాగా, ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు. కరెంట్ షాక్తో మృతి చెందిన తన అభిమానుల వార్త తనని దిగ్భ్రాంతికి గురి చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం.
ఆర్థికంగా ఆ కుటుంబాల వారిని ఆదుకొంటాను. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను అంటూ పవన్ కళ్యాణ్ తెలియచేసారు.