Advertisement

  • కేసీఆర్, కమిషనర్ మీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా

కేసీఆర్, కమిషనర్ మీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా

By: chandrasekar Mon, 30 Nov 2020 7:35 PM

కేసీఆర్, కమిషనర్ మీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా


మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘తెలంగాణ ముఖ్యమంత్రి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీద రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపాను. నా మీద నిరాధారమైన, తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినందుకు ఈ దావా వేశాను. వారు ఎలాంటి కండిషన్లు లేకుండా క్షమాపణ చెప్పాలి.

అలాగే, రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలి. నవంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లోని బషీర్ బాగ్‌లో ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీసులో సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నా మీద నిరాధార, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసు పంపుతున్నాను.’ అంటూ జి.వివేక్ వెంకటస్వామి ఆ ప్రకటనలో తెలిపారు.

Tags :
|

Advertisement