అసలైన ఐపీఎల్ మజా పంచిన RR , CSK మ్యాచ్...ఒక్క మ్యాచ్ లో 33 సిక్సులు
By: chandrasekar Wed, 23 Sept 2020 11:09 AM
రాజస్థాన్ రాయల్స్, చెన్నై
సూపర్ కింగ్స్ మ్యాచ్ అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా పంచింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్
17
సిక్సులు కొట్టగా.. ఈ మ్యాచ్లో ఓడిన చెన్నై 16 సిక్సులు బాదింది. ఇరు జట్లూ కలిపి 33
సిక్సులు బాది.. 416 పరుగులు చేశాయి. శాంసన్ వీరోచిత బ్యాటింగ్, స్మిత్ దూకుడు ఆఖర్లో ఆర్చర్ సిక్సుల మోతతో 2010
తర్వాత తొలిసారిగా చెన్నైపై రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన
ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216
పరుగులు చేసింది. కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ
శాంసన్, స్మిత్
పరుగుల వర్షం కురిపించారు.
శాంసన్ 19
బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 సిక్సులు, ఓ ఫోర్ సాయంతో 32 బంతుల్లో 74 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో 121
పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రాజస్థాన్ వరుస
విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కానీ మరో ఎండ్లో స్మిత్ దూకుడుగా ఆడి 47
బంతుల్లో 69 రన్స్ చేశాడు. 4 ఫోర్లు, 4 సిక్సులు బాదిన స్మిత్ ఔటయ్యాక రాజస్థాన్ 200
ల్లోపు స్కోరుకే పరిమితం కానుందని అనుకున్న తరుణంలో ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్
వరుసగా 4 సిక్సులు
పీకాడు. లుంగీ ఎంగీడి రెండు నో బాల్స్ వేయడంతో తొలి రెండు బంతులకే 27 రన్స్
రాగా ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులొచ్చాయి. దీంతో రాజస్థాన్ 7
వికెట్ల నష్టానికి 216 రన్స్ చేసింది.
భారీ స్కోరుతో బరిలో
దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు వాట్సన్, విజయ్ శుభారంభం ఇచ్చారు. 56
పరుగుల వద్ద వాట్సన్ రూపంలో తొలి వికెట్ పడ్డాక.. చెన్నై వేగంగా వికెట్లు
కోల్పోయింది. 114 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కానీ 37
బంతుల్లో 74 పరుగులు చేసిన డుప్లెసిస్ ధోనీతో కలిసి జట్టును
గెలిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఒత్తిడికి లోనైన డుప్లెసిస్ ఔటయ్యాడు. మరో
ఎండ్లో 12
బంతుల్లో 9 రన్స్ మాత్రమే చేసిన ధోనీ ఆఖరి ఓవర్లో వరుసగా మూడు
సిక్సులు కొట్టినప్పటికీ.. 200 పరుగులు చేసిన చెన్నై జట్టు విజయానికి 16
పరుగుల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్లో మొత్తం 33 సిక్సర్లు నమోదు కావడం ఐపీఎల్ రికార్డ్ కావడం
విశేషం. 2018లో
ఆర్సీబీ, చెన్నై
మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచ్లోనూ 33 సిక్సులు నమోదయ్యాయి.
పీయూష్ చావ్లా ఒకే ఓవర్లో
28
పరుగులు ఇవ్వడంతోపాటు లుంగీ ఎంగీడి ఆఖరి ఓవర్లో రెండు నో బాల్స్ వేసి 30
పరుగులివ్వడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
ఈ మ్యాచ్లో రాయుడు ఆడలేదు. అతడి స్థానంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన
రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ బాల్కే ఔటయ్యాడు. రాయుడు లేని లోటు స్పష్టంగా
కనిపించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్
స్పినర్లు 75 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... చెన్నై స్పిన్నర్లు 95 రన్స్
ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశారు. వాట్సన్ ఔట్ చేసి రాజస్థాన్కు తొలి బ్రేక్
ఇచ్చిన తెవాతియా.. తర్వాత వరుస బంతుల్లో సామ్ కర్రాన్, రుతురాజ్ను
ఔట్ చేశాడు. మొదటి 18
బంతుల్లో 17 రన్స్ చేసిన డుప్లెసిస్.. తర్వాతి 12
బంతుల్లో ఒక ఫోర్, ఏడు సిక్సుల సాయంతో 44 రన్స్ చేశాడు. కానీ మరో
ఎండ్లో ధోనీ 12 బంతుల్లో 9 రన్స్ మాత్రమే చేయడంతో సాధించాల్సిన రన్ రేట్
పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో ధోనీ వరుసగా 3 సిక్సులు కొట్టినా ఫలితం లేకపోయింది కానీ చెన్నై
వీరోచితంగా పోరాడి ఓడింది.