రోహిత్ ను ఆ ఫార్మాట్ కి కెప్టెన్ గా నియమించాలి ...మైకేల్ వాన్
By: Sankar Thu, 12 Nov 2020 3:41 PM
ఐపీఎల్ 2020 టైటిల్ సాధించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్ విజేతగా నిలిచింది. దాంతో ఐపీఎల్లో తిరుగులేని కెప్టెన్గా మారిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే రోహిత్ సారథ్యంకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఫిదా అయ్యాడు.
టీ20ల్లో భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేయాలని సూచించాడు. టీ20 ఫార్మాట్లో ఎలా గెలవాలో రోహిత్కు బాగా తెలుసని పేర్కొన్నాడు. అంతేకాదు ముంబై ఫ్రాంచైజీ టీ20 ప్రపంచకప్ ఆడితే అక్కడ కూడా టైటిల్ కూడా గెలుస్తుందని చెప్పాడు. 'ఇక ప్రశ్నలు అనవసరం.. రోహిత్ శర్మను టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయాలి. ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు.
అలాగే టీ20 గేమ్లను ఎలా గెలవాలో రోహిత్కు బాగా తెలుసు. అతడిని టీ20 కెప్టెన్ చేయడం వల్ల విరాట్ కోహ్లీకి కూడా భారం తగ్గే అవకాశం ఉంది. మిగతా జట్లు ఇద్దరు కెప్టెన్లు విధానాన్ని అనుసరించి ఫలితం రాబడుతున్నాయి' అని ట్వీట్ చేశాడు మైకెల్ వాన్.