Advertisement

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ ..భారీ మార్పులతో కోహ్లీ సేన

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ ..భారీ మార్పులతో కోహ్లీ సేన

By: Sankar Mon, 28 Sept 2020 7:33 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ ..భారీ మార్పులతో కోహ్లీ సేన


ఐపీఎల్ 2020 లో 10 వ మ్యాచ్ ఈ రోజు ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఆర్సీబీ జట్టులోకి కొత్తగా ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వచ్చాడు. ఇక స్టార్ బౌలర్ స్టెయిన్ స్థానంలో ఉదాన ఉమేష్ యాదవ్ స్థానంలో గురుకీరత్ వచ్చారు .ఇక ముంబై ఇండియన్స్ టీం లో సౌరబ్ తివారీ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు అయితే ఐపీఎల్ టోర్నీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 25 మ్యాచ్ లలో ఎదురుపడగా ముంబై 16 సార్లు విజయం సాధిస్తే బెంగళూరు 9 మ్యాచ్ లలో గెలిచింది. మరి ఈ 26 వ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

ముంబై జట్టు : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

బెంగళూరు జట్టు : దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), శివం దుబే, వాషింగ్టన్ సుందర్, గుర్కీరత్ సింగ్ మన్, ఇసురు ఉడనా, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా

Tags :
|
|

Advertisement