IPL 2020: రోహిత్ శర్మ సూపర్ రికార్డు...!
By: Anji Fri, 02 Oct 2020 10:00 AM
గురువారం జరిగిన ముంబయి ఇండియన్స్ వెర్సెస్ కింగ్స్ లెవన్ పంజాబ్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్గా నిలిచాడు.
ఈ రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ సురేశ్ రైనా తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ కు ముందు 4998 పరుగులతో ఉన్న రోహిత్.. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ బాది 5 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.
విరాట్ కోహ్లీ 180 మ్యాచ్ల్లో 5430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రైనా 193 మ్యాచ్ల్లో 5368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 191 మ్యాచ్ లు ఆడి ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరాడు.
Tags :
ipl 2020 |
2020 ipl |